ముంబైలో పగ తీర్చుకుంటాం: ముజాహిదీన్ హెచ్చరిక

సోమవారం, 28 జులై 2014 (11:09 IST)
భారత్‌కు ముజాహిదీన్‌తో మరో ముప్పు పొంచి వుందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గాజాలో జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ముంబైలో ఉగ్రదాడికి పాల్పడతామంటూ ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు బెదిరింపు లేఖ అందింది. 
 
‘1993లో మీకు (మారియా) అవకాశం వచ్చింది. కానీ ఈసారి కుదరదు. దమ్ముంటే మమ్మల్ని ఆపండి’’ అంటూ ముజాహిదీన్ అనే సంతకంతో హిందీ, ఆంగ్లంలో పంపిన లేఖలో రాసి ఉంది. దీంతో ముంబైలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసును నాడు డీసీపీ హోదాలో మారియా దర్యాప్తు చేశారు

వెబ్దునియా పై చదవండి