షీనా బోరా హత్యకు ముందు తన మనస్సులోని మాటను తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు తెలిపింది. నీతో సన్నిహితంగా మెలిగే వ్యక్తితో థాయ్లాండ్లో గడిపాను. అతనితోనే పిల్లల్ని కనాలని అనుకుంటున్నాను అని తల్లి ఇంద్రాణితో షీనా బోరా చెప్పినట్టు సమాచారం. దీన్ని భరించలేని ఇంద్రాణి కుమార్తె అని కూడా చూడకుండా గొంతునులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు షీనా బోరా హత్య కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. షీనా బోరా చనిపోయే సమయానికి ఆమె గర్భవతి అని తెలిసింది. తల్లి ఇంద్రాణికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి వల్లే షీనా గర్భందాల్చినట్టు విచారణలో వెల్లడైంది. మరోవైపు షీనా బోరాకు ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ ముఖర్జియాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతున్న విషయంతెల్సిందే. రాహుల్ కూడా పీటర్ ముఖర్జియా రెండో భార్య కుమారుడు. దీంతో షీనా బోరాకు వరుసకు సోదరుడు.
అయితే, షీనా బోరా వరుసకు తనకు సోదరి అవుతుందనే విషయం రాహుల్కు తెలియదని ఇతని స్నేహితులు చెపుతున్నారు. పైగా, రాహుల్తో షీనా ప్రేమలో పడిందనే విషయం తెలుసుకున్న ఇంద్రాణి.. నిజాలు వెలుగులోకి వస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించి అప్పటికే గర్భందాల్చివున్న షీనాను చాకచక్యంగా గొంతునులిమి హత్య చేసినట్టు సమాచారం. అయితే, షీనా బోరాకు గర్భం రాహుల్ ముఖర్జియా ద్వారా వచ్చిందా.. లేక ఇంద్రాణికి అత్యంత సన్నితుడిగా మెలుగుతూ అతనితో థాయ్లాండ్తో షీనా గడిపినందుకు వచ్చిందా అనేది తెలియాల్సివుంది.