ఈ కేసులో ప్రధాన నిందితుడు ముజామ్మిల్ అన్సారీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పేలుళ్లతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వాహిబ్ అన్సారీ, ఫర్హాన్ ఖోట్లకు కూడా జీవితఖైదు విధించింది. కేసులో మరో ముగ్గురు దోషులు సాఖిబ్ నచన్, అతీఫ్ ముల్లా, హసీబ్ ముల్లాలకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
కాగా, 2002 డిసెంబరు 6వ తేదీన, 2003 మార్చి 13వ తేదీన జరిగిన ముంబై పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. 2003 జనవరి 27న పేలుడులో ఓ వ్యక్తి మరణించిన విషయం తెల్సిందే. దీంతో ఈ పేలుళ్ళలో మొత్తం 13 మంది మృత్యువాతపడినట్టు అయింది.