సిక్కు అల్లర్ల బాధితులకు రూ.5 లక్షలు : మోడీ సర్కారు నిర్ణయం

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:25 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
గత 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఆమె హత్య అనంతరం పంజాబ్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో అనేక మందిని ఊచకోత కోశారు. ఆనాటి ఊచకోతలో అసువులు బాసిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. 
 
ఈ మేరకు ప్రధాని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ప్రధాని నిర్ణయం కారణంగా 3,325 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. గతంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేకపోయాయి. కానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి