"స్వచ్ఛ్ భారత్" పేరిట ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు నిధుల వరద ముంచెత్తుతోంది. సర్కారీ విద్యాలయాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలన్న మోడీ పిలుపునకు సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 100 కోట్లను ప్రకటించిన మరుక్షణమే టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ కూడా తన వితరణను చాటుకుంది.