ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, అధ్యక్షుడు రామ్ బరణ్ యాదవ్లకు మోడీ ఫోను చేసి హామీ ఇచ్చారు.
మరోవైపు.. నేపాల్కు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ముందు వరుసలో ఉంది. భూకంపంతో కకావికలమైన నేపాల్కు 4 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను విమానంలో భారత్ పంపింది. సహాయక చర్యల కోసం 40 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా వెళ్లింది. మెడికల్ బృందాలు, వైద్యులను వేరే విమానాల్లో పంపించారు.