అన్ని థియేటర్లలో జాతీయగీతం ఆలపించాల్సిందే : సుప్రీంకోర్టు

బుధవారం, 30 నవంబరు 2016 (12:22 IST)
దేశంలోని సినియా థియేటర్లలో విధిగా జాతీయ గీతం ఆలపించాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సినిమా థియేటర్ల యజమానులు ఆదేశాలు జారీచేసింది. దేశంలోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని ఆదేశించింది. అలాగే స్క్రీన్లపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని సూచించింది. బుధవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
 
జాతీయ గీతం, జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో సినిమా థియేటర్లలో ప్రతి ఒక్కరూ గౌరవసూచకంగా లేచి నిలబడాలని సూచించింది. కాగా ప్రస్తుతం కొన్ని మాల్స్‌ , థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి