వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్.. అగ్రస్థానంలో ఢిల్లీ.. హైదరాబాద్‌లో..?

బుధవారం, 17 మార్చి 2021 (13:35 IST)
మనదేశం వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. దీంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి వుందనే చెప్పాలి. ఎందుకంటే..? వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ 2020 (ఐక్యూ ఎయిర్‌) పేరిట ఓ స్విస్‌ సంస్థ రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. దేశంలో ప్రమాద ఘంటికలు మోగించింది. మనదేశంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్ల ముందు వచ్చింది.
 
ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య పీడిత నగరాల్లో(మోస్ట్ పొల్యూటడ్ సిటీస్) 22 మన భారత దేశంలోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య పీడిత రాజధాని నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం.. ఢిల్లీ వాయు నాణ్యత 2019 కంటే 2020లో దాదాపు 15 శాతం మెరుగైంది. 
 
అయినా ఢిల్లీ ప్రపంచ కాలుష్య పీడిత నగరాల్లో పదో స్థానంలో, రాజధాని నగరాల్లో అగ్రస్థానంలో ఉండటం ఆందోళనకరం. ప్రపంచంలో మోస్ట్ పొల్యూటడ్ కంట్రీస్ విషయానికి వస్తే భారత్ మూడో స్థానంలో నిలిచింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు అధికం. బెంగళూరు, చెన్నై కంటే ఈ కాలుష్యం హైదరాబాద్‌లోనే ఎక్కువ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు