కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య.. రాహుల్ గాంధీ ఏమన్నారు.?

శనివారం, 20 మే 2023 (19:32 IST)
Rahul Gandhi
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంచేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడింయంలో 15వేల మంది సమక్షంలో కాంగ్రెస్ నేత, సిద్ధరామయ్య శనివారం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు హామీలను నెరవేర్చేందుకు ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. 
 
ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్యతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణం చేశారు. ఈ ఇద్దరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.  
 
ఈ కార్యక్రమానికి తన సోదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. తమ పార్టీ హామీ ఇచ్చిన ఐదు హామీలను నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు. సినీ నటుడు కమలహాసన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు