శనివారం కేసు విచారణ ఉండగా దానికి మూడు రోజుల ముందుగానే అఫిడవిట్ దాఖలు చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను నితిన్ గడ్కరీ అమలుచేయలేదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా వ్యాఖ్యానించారు. మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన అఫిడవిట్ను శనివారమే సమర్పించారని, అందుకే రూ. 10 వేల జరిమానా విధిస్తూ, కేసు తదుపరి విచారణను 2015 మార్చి 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు.