కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రూ.10 వేల ఫైన్ : ఢిల్లీ కోర్టు ఆదేశం

శనివారం, 20 డిశెంబరు 2014 (18:53 IST)
కోర్టు ధిక్కరణకు పాల్పడిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీ కోర్టు రూ.10 వేల అపరాధం విధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్పై పరువునష్టం దావా కేసులో తమ ఆదేశాలు పాటించనందుకు ఈ అపరాధం విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
శనివారం కేసు విచారణ ఉండగా దానికి మూడు రోజుల ముందుగానే అఫిడవిట్ దాఖలు చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను నితిన్ గడ్కరీ అమలుచేయలేదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా వ్యాఖ్యానించారు. మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన అఫిడవిట్ను శనివారమే సమర్పించారని, అందుకే రూ. 10 వేల జరిమానా విధిస్తూ, కేసు తదుపరి విచారణను 2015 మార్చి 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి