దేశంలోని ధనవంతులకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. కొందరు హర్షించినా, వ్యతిరేకించినా దేశ శ్రేయస్సు కోసం అతి ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాలు గ్యాస్, డీజిల్ తదితర సమస్యలపై సరైన దృష్టి సారించలేదని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుంటుందని అరుణ్జైట్లీ తెలిపారు.