మే 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ఈవీఎంలపై అభ్యర్థుల ముఖచిత్రాలు, పేర్లు, గుర్తులు ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు కూడా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తత్కారే 2100 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అదే సమయంలో, సునీల్ తత్కారే అనే డమ్మీ అభ్యర్థికి 9,500 ఓట్లు పోలయ్యాయి.