పట్టపగలు నడి వీధిలో స్నేహితుడి గొంతుకోసి రక్తం తాగిన కిరాతకుడు...

సోమవారం, 26 జూన్ 2023 (14:20 IST)
కర్నాటక రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి కిరాతకంగా పట్టపగలు నడి వీధిలో తన స్నేహితుడిని గొంతుకోసి రక్తం తాగాడు. ఈ కిరాతక చర్య రాష్ట్రంలోని చిక్‌బళ్ళాపూర్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడు మారేశ్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని బలంగా నమ్మేశాడు. ఇదేవిషయంపై మాట్లాడేందుకు రావాలంటూ మారేశ్‌ను విజయ్ ఇంటికి పిలిచాడు. దీంతో విజయ్ ఇంటికి మారేశ్ వచ్చాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా వారిద్దరి మధ్య వాగ్వివాదం తీవ్ర రూపం దాల్చింది. 
 
ఈ క్రమంలో కోపంతో రెచ్చిపోయిన విజయ్.. పదునైన ఆయుధంతో మారేశ్ గొంతుకోశాడు. దీంతో కిందపడిపోయిన మారేశ్‌ను ఏదో ప్రశ్నిస్తూ అతడి గొంతు నుంచి ధారలా వస్తున్న రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాన్ని అటుగా నడిచివెళుతున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు... విజయ్‌ను అరెస్టు చేశారు. మారేశ్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు