వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే.. రెండు పాములు కనిపించాయ్.. పరుగులు తీసిన వైద్యులు..

శనివారం, 1 ఏప్రియల్ 2017 (09:44 IST)
ఓ ప్రభుత్వాసుపత్రిలో పాములు రోగులను పరుగులు తీసేలా చేశాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. అక్కడికి వచ్చిన పేషెంట్లను పాములు పలకరించాయి. దీంతో రోగులు వైద్యం వద్దు ఏమీ వద్దు.. ప్రాణాలతో బయటపడితే చాలునని పరుగులు తీశారు. ఈ ఘటన గుర్గామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రి కారిడార్ లోనే ఒక దాని వెంట మరొక పాము సంచరించడంతో రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 
 
రెండు అడుగుల పొడవున్న పాములు పదిగంటలకు రావడం చూసి భీతిల్లిన రోగులు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులకు సమాచారం అందించారు. అంతే పాములు పట్టేవారు వచ్చి ఓ పామును పట్టుకున్నారు. మరో పామును కొందరు సందర్శకులు కొట్టి చంపేశారు. తాను ఐదేళ్ల కుమారుడిని తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే పాము కనిపించడంతో భయపడ్డానని మరో రోగి ప్రభా తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి