అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మరోసారి పెట్రో ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 2.50 పైసలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రావచ్చని సమాచారం.
కాగా జమ్మూకాశ్మీర్, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు మళ్లీ తగ్గనుండటం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసిన నేపథ్యంలో ధరల తగ్గింపు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని భావిస్తున్నారు.