అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ పాటు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శశికళ షాక్ తిన్నారు. దీంతో ఆమె కొత్త సీన్కు తెరలేపారు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని, లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
అంతేకాకుండా, శశికళ కోరిక మేరకు.. నాలుగు వారాలు సమయం ఇస్తే మాత్రం తమిళనాడులో అల్లకల్లోలం సృష్టిస్తారని, ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఎంతమాత్రం మన్నించరాదని కోరుతున్నారు. జైలుశిక్షలు పడిన చాలామంది నేతలు ఆ శిక్షల నుంచి తప్పించుకోవడానికి అనారోగ్యం పేరిట నాటకాలకు తెరలేపడం చూస్తూనే ఉన్నామని, అందువల్ల సుప్రీంకోర్టు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.