అబ్దుల్ కలాం మార్గదర్శకుడు... ఆయన లేని లోటు పూడ్చలేనిది : ప్రధాని నరేంద్ర మోదీ

సోమవారం, 27 జులై 2015 (22:29 IST)
భారత దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లేని లోటు పూడ్చలేనిదని, ఆయన అందరికి మర్గదర్శకుడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన మృ‌తికి సంతాపం తెలిపారు. ఆయన మరణించారన్న వార్త తెలియగానే మోదీలో విచారం చోటు చేసుకుంది. 
 
ప్రజల రాష్ట్రపతిగా పేరుమోసిన ఆయన మిసైల్ లాంటి మనిషి అని కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయనను స్పూర్తి తీసుకుని యువత మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేసిన వ్యక్తి లేకపోవడం నిజంగా విచారకమని నరేంద్ర మోదీ అన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి