ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మణ్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని ట్విట్టర్లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆయన మరణంతో దేశం గొప్ప కార్టూనిస్టును కోల్పోయిందని వ్యాఖ్యానించారు. తన విలువైన కార్టూన్లతో కోట్లాది మందిని నవ్వుల్లో ముంచెత్తిన లక్ష్మణ్ మృతి మనందరికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
కాగా, దేశంలో సుప్రసిద్ధ కార్టూనిస్టుగా పేరొందిన ఆర్కే లక్ష్మణ్ 94 యేళ్ల వయస్సులో కన్నుమూసిన విషయం తెల్సిందే. పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.