మీడియా ప్రతినిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తమ పనితీరు వల్లే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో విజయం సాధించామని మోడీ వ్యాఖ్యానించారు. మీడియాతో తాము సత్సంబంధాలను నెరపుతామని ప్రకటించారు.
దేశ రూపురేఖలు మార్చేందుకు తాము కంకణబద్ధులమై ఉన్నామని, అందుకు సహకారం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులను కోరారు. అలాగే క్లీన్ ఇండియాలో మీడియా కూడా పాలుపంచుకోవాలని, తద్వారా దేశానికి మీడియా సేవ చేసినట్లు అవుతుందని మోడీ వ్యాఖ్యానించారు.