ప్రధాని నరేంద్రమోడీ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యాలయంలో నరేంద్రమోడీ సంపాదకులు, విలేకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ రూపురేఖలు మార్చేందుకు తాము కంకణబద్ధులమై ఉన్నామని, అందుకు సహకారం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులను కోరారు. అలాగే క్లీన్ ఇండియాలో మీడియా కూడా పాలుపంచుకోవాలని, తద్వారా దేశానికి మీడియా సేవ చేసినట్లు అవుతుందని మోడీ వ్యాఖ్యానించారు.