ముంబై మారణహోమం నిందితుడు, లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది రహ్మన్ లఖ్వీకు పాకిస్తాన్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై భారతదేశంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లఖ్వీ లాంటి ఉగ్రవాదికి బెయిల్ రావడం విచారకరమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.
కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతం చేస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీప్ చెప్పారని... దాన్ని ప్రపంచమంతా స్వాగతించిందని... ఇప్పుడు ఉగ్రవాది రహ్మన్ లఖ్వీకు ఎలా బెయిల్ వచ్చిందని మండిపడ్డారు. లఖ్వీ, హఫీజ్ సయీద్తో కలిసి ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడని జవదేకర్ ఆరోపించారు.