గురుపూజోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా తరగతి గతిలో మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చాలా చిలిపి వాడినని, తన చేత అమ్మ బలవంతంగా పనిచేయించేదని చెబుతూ, ఆనాటి రోజులను రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
తాను చదువుకున్న రోజుల్లో కిరోసిన్తో వెలిగే దీపాలు మాత్రమే ఉండేవని, తాను వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన యావరేజ్ స్టూడెంట్ను మాత్రమేనని ప్రణబ్ వివరించారు. నిత్యమూ పాఠశాలకు వెళ్లేందుకు 5 కి.మీ నడిచేవాడినని చెప్పుకొచ్చారు.