భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్ని కాశ్మీర్ అంశంపై శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ప్రతిపక్ష నేతలు మోడీని సోమవారం కలిసిన సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రాజ్యాంగానికి లోబడే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందన్నారు. కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రాణాలు కోల్పోయిన వాళ్లు యువకులైనా, భద్రతా దళాలైనా, పోలీసులైనా వాళ్లంతా మనవాళ్లేనని చెప్పుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల వద్దకు వెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్రం నెలకొన్న పరిస్థితులపై మోడీకి రాష్ట్ర నేతలు వివరించారు.