రాహుల్ గాంధీ అజ్ఞాతవాసానికి ముగింపు... త్వరలో ఢిల్లీకి!

శుక్రవారం, 27 మార్చి 2015 (13:08 IST)
దాదాపు మూడు వారాలుగా అజ్ఞాతవాసంలో ఉంటున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే ఢిల్లీ చేరుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుక్కుగా పాల్గొననున్నారు. అలాగే, ఏప్రిల్ 20 నుంచి మళ్లీ ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. 
 
కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే ఆయన తన అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 
 
దీంతో అధిష్టానం దిగొచ్చింది. మే 15 నుంచి సెప్టెంబర్ 30లోగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో శాంతించిన రాహుల్ గాంధీ అజ్ఞాతాన్ని వీడేందుకు సమ్మతించారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీలో వాలిపోతారట. వచ్చీరాగానే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన ఉవ్వళ్లూరుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 

వెబ్దునియా పై చదవండి