అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంలో మోదీ వేసుకున్న సూటు ఖరీదు అక్షరాలా రూ. 10 లక్షలని ఆయన ఆరోపించారు. తానో సామాన్యుడినని పదే పదే చెప్పే మోదీ తన షూటు నిండా తన పేరు కుట్టించుకుని ప్రచారం చేసుకున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. మోదీ వ్యవహారానికి.. చెప్పే మాటలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ఆరోపించారు. ఇదే వ్యవహర శైలితో జనాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు.
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామంటూ ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతీయులను మోసం చేశారన్నారు. ఆక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే.. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తోందని ఆయన విమర్శించారు. వచ్చిన అవకాశాన్ని కాలదన్ని తిరిగి ఎన్నికలు రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీనే కారణమని అన్నారు.