19న ఎక్కుపెట్టిన బాణంలా తిరిగి వస్తున్న రాహుల్ : దిగ్విజయ్

మంగళవారం, 31 మార్చి 2015 (10:43 IST)
గత కొద్ది రోజులుగా అజ్ఞాతవాసాన్ని గడుపుతున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఈనెల 19వ తేదీన ఎక్కువ పెట్టిన రామబాణంలా తిరిగి వస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా భారీ ర్యాలీని నిర్వహించనుందన్నారు. 
 
ఆ రోజునే రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగివస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ పాల్గొంటారని తెలిపారు. విశ్రాంతి కాలంలో ప్రశాంతంగా గడిపిన రాహుల్, ఎక్కుపెట్టిన బాణంలా తిరిగి వస్తారన్నారు. కాగా, మే 8న రాహుల్ మహారాష్ట్రలో ఓ కోర్టులో హాజరుకావాల్సిన ఉన్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి