భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఓ టైం బాంబు పెట్టారనీ, అది వచ్చే డిసెంబరులో పేలుతుందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఓ ట్వీట్ చేశారు.
కాగా, రఘురాం రాజన్ను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా స్వామి మాటల దాడి చేస్తున్న విషయం తెల్సిందే. రాజన్ మరోమారు ఆర్బీఐ గవర్నర్గా కొనసాగించవద్దంటూ ఇప్పటికే ప్రధానికి సుబ్రమణ్య స్వామి ఇప్పటికే రెండు లేఖలు రాయగా, తాజాగా మరోమారు విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.