బస్సులోని ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన సాహసోపేత గురుదాస్పూర్ డ్రైవర్ నానక్ చంద్ ఓ తాత్కాలిక ఉద్యోగి మాత్రమే.. తన జీతం నెలకు రూ. 5 వేలు. ప్రస్తుతం ఆయన తన ఉద్యోగాన్ని క్రమబద్దీకరించమని వేడుకుకుంటున్నాడు. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల పంజాబ్లోని గురుదాస్పూర్లో ఉగ్రవాద దాడి సమయంలో సాహసం ప్రదర్శించి ధైర్యంగా 76 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్ తన ఉద్యోగం క్రమబద్ధీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.