మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే.. అంత్యక్రియలపై నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో కలాం అంత్యక్రియలను తమ సొంతూళ్లోనే నిర్వహించాలని ఆయన మనవడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సలీమ్ అభ్యర్థనను కూడా నేటి కేబినెట్ భేటీ పరిగణనలోకి తీసుకోనుంది. సలీమ్ ప్రతిపాదనతో పాటు ఢిల్లీలో కలాం అంత్యక్రియల నిర్వహణపైనా ప్రభుత్వం చర్చించనుంది.