దేశంలో నానాటికి తగ్గిపోతున్న హిందువుల జనాభాను పెంచే దిశగా శివసేన సంస్థ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదుగురు పిల్లలను కలిగిన ప్రతి హిందూ కుటుంబానికి రెండు లక్షల రూపాయలను అవార్డుగా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ విషయం గురించి శివసేన రాష్ట్ర అధ్యక్షురాలు వీను లావణ్య శుక్రవారం రోజు విలేకర్లతో మాట్లాడుతూ.. ఇటీవల దేశ జనాభాలో లెక్కల్లో హిందువుల సంఖ్య ఘననీయంగా తగ్గిందని తెలియడంతో ఈ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు తెలిపింది.