బాధిత మహిళలను కదిలిస్తే.. మయాన్మార్ సైనికులు అత్యంత పైశాచికంగా ప్రవర్తించారని తెలిసిపోకతప్పదు. తమపై మయాన్మార్ సైనికులు ఒకరి తర్వాత మరొకరు వరుసబెట్టి అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, మమ్మల్ని మంచంపై తోసి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళలు, రోహింగ్యా శరణార్థ మహిళలు కన్నీళ్లతో చెప్పుకున్నారు. సైనికుల దాడులతో తాము కిలోమీటర్ల దూరం నడచి సరిహద్దుల్లో తలదాచుకున్నామని వారు పేర్కొన్నారు.