టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్ర కేసుపై సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. అయితే దాదాపు 25 ఏళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడిన రుచికా కేసులో దోషిగా తేలిన మాజీ డీజీపీ ఎస్పీఎస్ రాథోడ్ జైలు శిక్ష అనుభవించే వీలు లేదు. కేసులో నిందితుడు ఎస్పీఎస్ రాథోడ్ 1990లో అప్పటి ఐజీపీగా, హరియాణా లాన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా రాథోడ్ పై కేసు పెట్టడంతో పోలీసులు వేధింపులు తాళలేక చిన్న వయసులోనే ఎంతో ఒత్తిడికి గురయిన రుచిక 1993, డిసెంబర్ 28న విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ఆమెపై వేధింపుల కేసులో విచారణ చేపట్టిన చండీగఢ్ న్యాయస్థానం చివరకు రాథోడ్ను దోషిగా తేల్చింది. 2009 డిసెంబర్లో కేసులో తీర్పునిస్తూ, రాథోడ్కు 18 నెలల శిక్ష విధించింది. ఇప్పటికే జైలు శిక్ష పడటంతో అతనిక జైలుకెళ్ళాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చేసింది.