భారతీయ జనతా పార్టీ తనపై, తన పార్టీపై కక్ష కట్టిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను స్వయంగా సుప్రీంకోర్టే తప్పుబట్టిన విషయాన్ని మమత బెనర్జీ గుర్తు చేశారు.