ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును ప్రతి పాదిస్తూ ఓ తీర్మానం చేశారు. దీనికి సర్వసభ్య సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇకపై ఆమె తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ నేతలు తప్పనిసరిగా కట్టుబడాల్సి ఉంటుంది. అలాగే, పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆమె ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు.
ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, ఎమ్మెల్యేలు పోయెస్గార్డెన్కు వెళ్లి శశికళను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరనున్నారు. అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టడంతో... ఆ పార్టీలో కొత్త శకం ప్రారంభమయినట్టైంది.