రాజీవ్ గాంధీ హత్యకేసు : నళిని బెయిల్‌పై సుప్రీం నోటీసులు

శుక్రవారం, 25 జులై 2014 (12:30 IST)
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ హత్యకేసుకు సంబంధించి గత 23 ఏళ్లుగా జైలులో ఉన్న తనను విడుదల చేయాలని కోరుతూ నిందితురాలు నళిని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. 
 
నళిని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె తరఫున కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా రాజీవ్‌గాంధీ హత్యకేసులో మరణశిక్ష పడిన మురుగన్‌, శాంతన్‌, పేరరివాలన్‌లు క్షమభిక్షకోరుతూ రాష్ట్రపతిని అభ్యర్థించగా దానిపై 10 సంవత్సరాలుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వెబ్దునియా పై చదవండి