గత 22వ తేదీన చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్కు వెళుతూ గల్లంతయిన ఏఎన్-32 విమానం ఆచూకి కోసం భారత వైమానిక, నావికాదళం తీవ్రంగా శ్రమించినా ఇప్పటివరకూ దాని ఆచూకి లభించలేదు. దీనితో గల్లంతయిన విమానం ఆచూకిని కనుగొనాలని అమెరికాను అభ్యర్థించింది భారతదేశ ప్రభుత్వం. విమానం గల్లంతుపై విమానయాన మంత్రి మాట్లాడుతూ... విమానం గల్లంతు పెద్ద పజిల్లా మారిందనీ, దాని ఆచూకి ఎక్కడో ఇప్పటివరకూ కనుగొనలేకపోయినట్లు వెల్లడించారు.