ఇపుడు తాజాగా మోడీ పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని సాగరతీరాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను శశిథరూర్ ట్వీట్ చేశారు. వాటిని చూసిన ప్రధాని మోడీ పారిశుద్ధ్య కార్యక్రమంలో థరూర్ పాల్గోవడం ప్రోత్సాహకరమని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు థరూర్ ట్వీట్ చేసిన ఫోటోలను జత చేసి రీట్వీట్ చేశారు.
అయితే, ఇప్పటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవిని పోగొట్టుకున్న థరూర్.. ఇపుడు మరింతగా దూకుడుగా పొగడ్తల వర్షం కురిపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. థరూర్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.