పశ్చిమ బెంగాల్లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి బెంగళూరులోని సీతా బతేజా ఆసుపత్రిలో మెదడులోని కణితిని తొలగించే ఆపరేషన్ జరిగింది. దాదాపు మూడున్నర గంటల పాటు డాక్టర్లు ఈ ఆపరేషన్ చేయగా, ఆమె మెదడులోని సమాచార వ్యవస్థ పనిచేస్తూనే ఉంది.
ఆపరేషన్ జరుగుతుంటే, తనకిష్టమైన రవీంద్రనాథ్ ఠాగూర్ పాటల్ని పాడిందట. అంతేగాకుండా డాక్టర్లను వారాల పేర్లు చెప్పండని ప్రశ్నించిందట. అంతటితో ఆగకుండా ఆపరేషన్ థియేటర్లో గల ఓ బొమ్మను ఏం కనిపిస్తోంది? ఒకటి నుంచి వంద వరకూ, వంద నుంచి ఒకటి వరకూ అంకెలు చెప్పండి? అంటూ ప్రశ్నలు సంధించిందట. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.