ఐతే కర్నాటక ముఖ్యమంత్రి తన చేతికి రూ. 70 లక్షల విలువ చేసే వాచీని పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి ఆరోపిస్తున్నారు. ఐతే ఆ గడియారాన్ని సిద్దరామయ్య ధరించలేదనీ, అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఓ మంత్రిగారు సిద్దరామయ్యకు సన్నిహితులైన వ్యక్తికి బహుమతిగా ఇచ్చిందని మరో వాదన జరుగుతోంది.