భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయేందుకు ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు పక్కా ప్లాన్ చేశారు. అయితే పోలీసుల ఎన్కౌంటర్లో ఆ ఎనిమిది మంది హతమైనారు. కానీ జైలు నుంచి పారిపోవడానికి ఎనిమిది మంది సూపర్ ప్లాన్ వేశారని సమాచారం. తమకు అందుబాటులో ఉన్న టూత్ బ్రష్, ఓ చెక్కతోనే తమ ప్లాన్ను సక్సెస్ చేశారని తెలిసింది.
టూత్ బ్రష్, చెక్కతోనే ఓ తాళం చెవిని రూపొందించిన టెర్రర్ మూకలు.. అదే తాళంతో బ్యారక్ గది తాళాలు తీసినట్టుగా అధికారులు గుర్తించారు. బ్యారక్ తాళాలు తీసి తప్పించుకునే క్రమంలోనే రమాశంకర్ అనే కానిస్టేబుల్ను హత్య చేశారు.