కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి

గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:40 IST)
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్‌ ఏచూరి మరణించారు. తన పెద్ద కుమారుడు కరోనాతో మరణించినట్లు ఏచూరి స్వయంగా ట్విటర్‌లో తెలిపారు.

ఇటీవల కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.

 ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే తన కుమారునికి వైద్యం అందించిన వైద్యులు, ఇతర సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆశిష్‌ ఏచూరీ జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు