తమిళనాట తాజా పరిణామాలపై కమలహాసన్కి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి మధ్య కొన్ని రోజులుగా ట్విట్టర్ యుద్ధం జరుగుతోంది. కమలహాసన్ని ఇడియట్గా సంబోధిస్తూ స్వామిచేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. కమల్హాసన్ బీజేపీలో చేరి, ఆయన ఇష్టప్రకారం ప్రభుత్వాన్ని నడిపితే మీరు అంగీకరిస్తారా’ అంటూ అన్న ప్రశ్నకు స్వామి స్పందిస్తూ... ‘బీజేపీ గురించి నాకుతెలియదు కానీ, నేనుమాత్రం కమల్హాసన్ అని పిలుచుకునే ఎముకలేని అద్భుతమైన, స్వార్థ ఇడియట్ను అంగీకరించను’ అని ట్వీట్ చేశారు.
మొత్తంమీద ఆయన దూకుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యక్షంగా ఆయనపై దాడికి సిద్ధంగాలేని అన్నాడీఎంకే తన పద్ధతిలో ఇండియన నేషనల్ లీగ్ నాయకుడు ఫిర్దోస్తో కేసుపెట్టించింది. పళనిస్వామి అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన సందర్భంగా హింసను ప్రేరేపించే లా కమల్ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్దోస్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు.