కానీ, తమిళులు మాత్రం ఆయనను తమిళ వ్యతిరేక ద్రోహిగా చిత్రీకరించాయి. ఫలితంగానే తమిళనాడులో ఆయనకు వ్యతిరేకంగా ప్రతి నిత్యం ఏదో ఒక ఆందోళన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం ఎదుట ఈ తరహా సంఘటనలు ప్రతి రోజూ చూస్తునే ఉంటాం. అందుకే ఇక్కడ పదుల సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించి వుంటాయి.
అయితే, సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ విజ్ఞప్తి ఎల్టీటీఈని అభిమానించే తమిళులకు ఆగ్రహం తెప్పించే విషయమైనప్పటికీ.. ఆయన మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. కేవలం తమిళులను రెచ్చగొట్టమే ధ్యేయంగా సుబ్రమణ్య స్వామి ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.