గవర్నర్ ఆరోపణలపై స్పందించడానికి కేంద్రానికి, గోస్వామికి ఆరువారాలు గడువు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా నేతృత్వంలోని బెంచ్, ఈ వ్యవహారంలో రాజ్యాంగంలోని 156 అధికరణ (గవర్నర్ పదవికి సంబంధించిన) అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంటూ కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన తొలి గవర్నర్ ఖురేషీ కావడం గమనార్హం.