అదేసమయంలో ఈ కేసు దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, మూడు నెలల తర్వాత బెయిల్ కోసం గాలి జనార్ధన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. అయితే, గాలి కేసుల విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని దిగువ కోర్టును సుప్రీం ఆదేశించింది. ప్రస్తుతం ఆయన రిమాండులో ఉంటున్న సంగతి తెలిసిందే.