యూరీ ఉగ్రదాడి జరిగిన 10 రోజుల తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో పొంచి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. మొత్తం 7 శిబిరాలపై సుమారు 4 గంటలపాటు వైమానిక దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో 38 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా సర్జికల్ దాడులపై పాకిస్తాన్ దేశానికి ముందుగానే సమాచారం ఇచ్చామని భారత డీజీఎమ్ఓ రణబీర్ సింగ్ వెల్లడించారు.
# ఎల్వోసికి ఆవల ఉన్న భింబర్, హాట్స్ప్రింగ్, కెల్ అండ్ లిపా సెక్టార్లలోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేశారు.