ఈ ప్రయటనలో భాగంగా చైనాలో భారతీయులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం సుష్మ విలేకర్లతో మాట్లాడుతూ.. తనకు ఇదే తొలి చైనా పర్యటన అని తెలిపారు. కైలాష్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గం ఏర్పాటు చేసే విషయమై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ అదనపు మార్గం ద్వారా యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం వీలవుతుందని ఆమె వివరించారు.
కాగా, గతేడాది సెప్టెంబర్లో చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత్లో పర్యటించగా, అందుకు ప్రతిగానే నరేంద్ర మోడీ ఈ ఏడాది వేసవిలో ( ఏప్రిల్ నెలలో) చైనా పర్యటనకు వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు.