మోడీ ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలయింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు ఉండే వాల్మీకీ సదన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, కార్యక్రమాన్ని ప్రారంభించారు.