ప్రేమకు చిహ్నంగా.. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ మరమ్మత్తులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. తాజ్మహల్ చుట్టూగల ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ కాలుష్యం కారణంగా.. పొగతో పాలరాతి తాజ్మహల్ రంగు మారిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన ఆగ్రాలో వెలసిన సుప్రసిద్ధ తాజ్ మహల్కు మేకప్ వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మడ్ థెరపీ (Mud Therapy) చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది.