కాగా, మొదటి రెండు బ్లాకుల్లో పళనిస్వామికి మెజార్టీ దక్కింది. ఒక్కో బ్లాకులో 38 మంది సభ్యులు ఉన్నారు. కాగా, మొత్తం 6 బ్లాకుల్లో సాగుతున్న ఓటింగ్. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు డీఎంకే యత్నిస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో తొందరెందుకని ప్రశ్నించింది. డీఎంకే ఎమ్మెల్యేల గందరగోళంతో అరగంటపాటు సభ వాయిదా పడినట్లు తెలిసింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు.